తెలుగు భాషా చైతన్య సదస్సులు విజ‌య‌వంతం

తెలుగు అకాడమీ చైర్మన్‌ లక్ష్మీ పార్వతి

చిత్తూరు:  తిరుప‌తిలో నిర్వ‌హించిన‌ తెలుగు బాషా చైతన్య సదస్సులు విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని,  ఈ కార్యక్రమాల్లో సంస్కృత బాషా కవులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని తెలుగు అకాడమీ చైర్మన్‌ లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని ఆమె తెలిపారు.
పుస్తకాల ప్రింటింగ్ పూర్తి అయిందిని.. మరో పదిరోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని వెల్లడించారు. 

తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. 

టీడిపీ ప్రభుత్వం వదిలేసిన తెలుగు అకాడమీని వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం తిరిగి  తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించడం పట్ల లక్ష్మీపార్వతి  ఆనందం వ్యక్తం చేశారు.

Back to Top