మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి
21 Apr 2022 10:35 AM
వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు
విజయవాడ: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం.. రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైల్పై మొదటి సంతకం చేశారు. 3,500 ట్రాక్టర్లని వైయస్సార్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్పై రెండో సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'వ్యవసాయ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించాం. రూ.20 వేల కోట్లకు పైగా రైతు భరోసా కింద ఇప్పటివరకూ నగదు బదిలీ చేశాం. గన్నవరలో స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించాం. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపట్టాం. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని' ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు.