సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన జాహ్నవి 

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాలకొల్లుకు చెందిన జాహ్నవి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని జాహ్న‌వి కలిసి...పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నట్లు సీఎంకి వివరించిన జాహ్నవి. జాహ్నవి విజ్ఞప్తిపై  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు.

Back to Top