అమరావతి:పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు.ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన విందులో పాల్గొంటారు. ముస్లిం ఎమ్మెల్యేలు,మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.వైయస్ఆర్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ మెహమ్మద్ ముస్తఫా, కిలారి వెంకట రోశయ్య, మేకతోటి సుచరిత,గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి,మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మ్రరి రాజశేఖర్ తదితరులు ఏర్పాట్లను సమీక్షించారు.