రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
సీఎం వైయస్ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు
28 Nov 2022 2:46 PM
ఉరవకొండ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపించారని ఉరవకొండ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైయస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాన్ని విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని గుర్తించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గ్రామాల్లో అన్ని వసతులు కల్పించి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతులకు తోడ్పాటు అందిస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.