రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నేడు దర్శి, విజయవాడలో సీఎం వైయస్ జగన్ పర్యటన
20 Dec 2022 10:41 AM
తాడేపల్లి: నేడు ప్రకాశం జిల్లా దర్శి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దర్శి పట్టణానికి చేరుకుంటారు. అక్కడ జరిగే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు.