సామాజిక న్యాయమే సీఎం వైయస్‌ జగన్‌ విధానం 

వైయస్ఆర్ సీపీ ఎంపీల స్పష్టీకరణ

బడుగు బలహీనవర్గాలకు సీఎం కొండంత అండ

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి చేయూత

సంపదలో జనాభా ప్రాతిపదికన వాటా. రాజ్యాధికారంలో చోటు

దేశంలోనే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇందుకు ఆదర్శం

ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మస్తాన్‌రావు, మాధవి, సత్యవతి

చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిథ్యం కావాలి

అందుకోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు

ఆది ఆమోదం పొందేలా గట్టిగా ప్రయత్నిస్తాం

ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో వైయస్ఆర్‌సీపీ ఎంపీలు 

 న్యూఢిల్లీ: రాష్ట్రంలో అయినా రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా సామాజిక న్యాయమే సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి విధానమని వైయస్ఆర్ సీపీ ఎంపీలు స్ప‌ష్టం చేశారు. న్యూఢిల్లీ ఏపీ భవన్‌లో వైయస్ఆర్ సీపీ ఎంపీలు డాక్టర్‌ వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడారు. 

 

ఆర్‌.కృష్ణయ్య ఏమ‌న్నారంటే..
 స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏ ప్రభుత్వం కూడా మేలు చేయలేదు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దేశంలో గతంలో ఎక్కడా లేని విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన సంపదలో వాటా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం కేటాయించేలా, పార్లమెంటులో ప్రైవేటు బిల్లుపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. బీసీల చరిత్రలో అది ఒక మైలురాయిలా నిలవనుంది. ఆ బిల్లు ఆమోదం పొందేలా మేము గట్టిగా ప్రయత్నిస్తాం.
    గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ బీసీలకు ఒకేసారి 10 మంత్రి పదవులు ఇవ్వలేదు. కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్, 25 మంది మంత్రుల్లో 10 మంది బీసీలు, 5గురు ఎస్సీలు, ఒక ఎస్టీకి, ఒక మైనారిటీకి పదవులు ఇచ్చి, దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిల్చారు. ఇంకా నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాటా ఇస్తూ, నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి జగన్‌గారు.
56 కులాలలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు. పాలక మండళ్లలో కూడా వారికి తగిన ప్రాతినిథ్యం. వివిధ కులాలను అభివృద్థి చేయడం కోసం వారికి ఛైర్మన్‌ పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా 56 కార్పొరేషన్లు లేవు. అవి ఇక్కడ మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా ఆయా కులాల వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
    స్థానిక సంస్థల్లో 44 శాతం పదవులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చారు. ఆ విధంగా ఆయా వర్గాల వారికి నాయకత్వం పెంచేలా కృషి చే«శారు. 5గురు ఉప ముఖ్యమంత్రుల పదవులు ఉంటే, నాలుగు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. గ్రామ వలంటీర్లలో దాదాపు 90 «శాతం బలహీనవర్గాలకు ఇచ్చారు. ఇవన్నీ చూసి ఇతర రాష్ట్రాల వారు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
    రాష్ట్రంలో బీసీ సబ్‌ ప్లాన్‌ పెట్టి, వారికి ప్రత్యేకంగా నిధులు రూ.30 వేల కోట్లు కేటాయించగా, చివరకు కేంద్రం అందుకు ఇచ్చింది కేవలం రూ.1400 కోట్లు మాత్రమే. అవి ఒక్కో రాష్ట్రానికి రూ.50 కోట్లు కూడా రావు. దాంతో ఒక్క పని కూడా జరగదు.
    ప్రతి విద్యార్థికి 1 నుంచి 10వ తరగతి వరకు అమ్మ ఒడిలో రూ.15 వేలు ఇస్తున్నారు. ఆ విధంగా పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకునేలా ఒక విజనరీగా సీఎం పని చేస్తున్నారు. మొత్తం బడ్జెట్‌లో 27 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థులకు వ్యయం చేస్తున్నారు. ఆ విధంగా వారి జీవితాలు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
    నిజానికి అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు పెడితే, అంతటా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు బాగా అభివృద్ధి చెందుతారు. ఆదివాసీ అందునా మహిళ కాబట్టి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ను బలపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక బీసీ.
బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇస్తూ, ధన్‌కర్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అందుకే ఆయనకు మా పార్టీ మద్దతు ఇస్తోంది.

 బీసీలు కూడా పార్లమెంటులో గళం వినిపించే అవకాశం: బీద మస్తాన్‌రావు 
  సీఎం శ్రీ వైయస్‌ జగన్, మాకు మంచి అవకాశం ఇచ్చారు. బీసీలు కూడా పార్లమెంటులో గళం వినిపించే అవకాశం కల్పించారు. బీసీలు అంటే వెనకబడిన వారు కాదు. వారు బ్యాక్‌బోన్‌ (వెన్నెముక) వంటి వారని సీఎంగారు రుజువు చేశారు. రాజ్యసభలోనే 9 మంది వైయస్సార్‌సీపీ ఎంపీలు ఉంటే, వారిలో 5గురు బీసీలు ఉన్నారు. ఆ విధంగా ఆ స్థాయిలో ఏ పార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఆ గౌరవం మా సీఎంగారికే దక్కుతుంది.
    నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం, అన్ని పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని సీఎంగా నిర్ణయించి, దానిపై చట్టం కూడా చేశారు.
చట్టసభల్లో బీసీలకు ఇంకా ప్రాతినిథ్యం లభించేలా పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాం. దాని ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం. అందరం ఏకమై, ఆ బిల్లు ఆమోదం పొందేలా ప్రయత్నిస్తాం. ఇంకా ముస్లింలకు తొలుత రిజర్వేషన్‌ కల్పించింది మహానేత వైయస్సార్‌ అయితే, ఆయన తనయుడు, సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారికి ఇంకా మేలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు  బాగా చదువుకుంటున్నారు.
    బీసీ ఉప ప్రణాళిక కింద ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న గత ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం రూ.18,500 కోట్లు మాత్రమే.
అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ఏటా రూ.15 వేల కోట్లు ఇస్తామన్నారు. ఆ మేరకు ఇప్పటికే రూ.45 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశారు. అది ఆయన చిత్తశుద్ధికి నిర్ణయం.

వైయస్‌ జగన్‌ మద్దతు ప్రకటించడం అభినందనీయం: గొడ్డేటి మాధవి 
– దేశంలో తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళకు దేశంలో అత్యున్నతమైన  రాష్ట్రపతి పదవి దక్కుతోంది. ఆమెకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మద్దతు ప్రకటించడం నిజంగా అభినందనీయం.మా నాన్నగారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసి, చనిపోతే ఆయనను గుర్తు పెట్టుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, నన్ను ఒక ఎంపీని చేశారు. నాకు ఆ గొప్ప అవకాశం కల్పించారు. అందుకు సీఎంగారికి ఎంతో రుణపడి ఉంటాను. ఇంకా మా గిరిజన ప్రాంతంలో మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు, ట్రైబల్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా మాకు సీఎంగారు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు.

వైయస్‌ జగన్‌ నిర్ణయం నిజంగా హర్షణీయం: డాక్టర్‌ వెంకట సత్యవతి 
– గిరిజన తెగకు చెందిన ముర్ముగారికి రాష్ట్రపతిగా పీఎం శ్రీ మోదీగారు అవకాశం ఇచ్చారు. ఆమెకు మద్దతు ఇవ్వాలన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం నిజంగా హర్షణీయం. ఇది దేశ ప్రజలకు కూడా ఒక మంచి సందేశం ఇస్తుంది. అదే విధంగా ఉప రాష్ట్రపతిగా బీసీ అయిన జగదీప్‌ ధన్‌కర్‌కు మద్దతు ఇవ్వాలని సీఎంగారు నిర్ణయించారు. మేమంతా సీఎంగారి బాటలో నడుస్తాం.
    ఆనాడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కన్న కలలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సాకారం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేలా ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.

Back to Top