టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
కోవిడ్ రీత్యా తిరుపతికి రాలేకపోతున్నా..
10 Apr 2021 3:53 PM
తిరుపతి ఓటర్లకు సీఎం వైయస్ జగన్ బహిరంగ లేక
తిరుపతిలో నా బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నా
ఈ 22 నెలల్లో ఇంటింటికీ మనిషి మనిషికి చేసిన మంచి మీ అందరికీ చేరిందని నమ్ముతున్నా..
మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తున్నా..
తాడేపల్లి: రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14న తలపెట్టిన తిరుపతి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు సీఎం వైయస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ఇలా..
తిరుపతి పార్లమెంటు ఓటర్లకు, మీ జగన్ రాస్తున్న లేఖ
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో మనందరి అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాల్సిందిగా నేను రాసిన ఉత్తరం మీ ఇంటికి చేరిందని భావిస్తున్నాను.
ఈ నెల 14న తిరుపతి బహిరంగ సభకు నేను వస్తానని ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ సభకు రావటం ద్వారా మీ ఆత్మీయతను, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించాను. అయితే తాజా హెల్త్ బులెటిన్ చూసిన తరవాత ఈ లేఖ రాస్తున్నాను దేశంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి బులెటిన్ ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో 31,892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2,765 మంది పాజిటివ్ అని తేలింది. పాజిటివిటీ రేటు 8.67 శాతంగా కనిపిస్తోంది. ఇది మన రాష్ట్ర సగటు పాజిటివిటీ రేటు అయిన 5.87 శాతం కంటే ఎక్కువగా పెరిగిన విషయం కనిపిస్తోంది. అందులో 496 తో చిత్తూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన కేసులు ఒక్క రోజులోనే 292 నమోదయ్యాయి.
గంటల వ్యవధిలో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారు ఈ రెండు జిల్లాల్లో ఉన్న తిరుపతి పార్లమెంటులో నేను వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరైతే... అభిమానంతో, ఆప్యాయతతో వేలాదిగా తరలి వస్తారు. వీరందరూ నాకు ముఖ్యమే, వీరంతా నావాళ్ళే. వీరందరి ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యమే. వీరందరి కుటుంబాలూ చల్లగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిగా... బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతగల స్థానంలో ఉన్న ఒక అన్నగా ఒక తమ్ముడిగా తిరుపతిలో నా బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నాను.
నేను వ్యక్తిగతంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా, మనందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం, మన అవ్వాతాతల కోసం, మన అక్కచెల్లెమ్మల కోసం, మన రైతుల కోసం, మన గ్రామాలూ పట్టణాల కోసం.....
మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల కోసం... మన అక్కబెల్లెమ్మల కోసం ఏం చేసిందన్నది మీ అందరికీ వివరిస్తూ, ప్రతి కుటుంబంలోని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వ్యక్తిగతంగా... మీకు కలిగిన లబ్దికి సంబంధించిన వివరాలతో... నా సంతకంతో ఇంటింటికీ అందేలా ఉత్తరం రాశాను. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాకుండా ఆగిపోయినా మనందరి ప్రభుత్వం ఈ 22 నెలల్లో ఇంటింటికీ మనిషి మనిషికి చేసిన మంచి మీ అందరికీ చేరిందన్న నమ్మకం నాకుంది
మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండెనిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని, మనందరి అభ్యర్థి, నా సోదరుడు డాక్టర్ గురుమూర్తిని.. గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ (2.28 లకల) కన్నా ఇంకా ఎక్కువగా... ఫ్యాన్ గుర్తుమీద ఓట్లు వేస్తారని, ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ.. అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకూ, మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను
ఇట్లు
మీ సోదరుడు
మీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు,
మీ ముఖ్యమంత్రి
మీ....
వైయస్ జగన్ మోహన్ రెడ్డి