రేపు సీఎం వైయ‌స్‌ జగన్ నర్సీపట్నం పర్యటన

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం  అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. 11.15 – 12.50 జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన, తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన, అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం 1.25 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top