నేడు దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోనున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న ముఖ్య‌మంత్రి

విజయవాడ: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన శ్రీ క‌న‌కదుర్గ అమ్మ‌వారిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు ద‌ర్శించుకోనున్నారు. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని మూలాన‌క్ష‌త్రం (అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం) రోజున దుర్గ‌మ్మ స‌ర‌స్వ‌తీ దేవి అలంక‌ర‌ణ‌లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం రోజున ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇంద్ర‌కీలాద్రికి చేరుకుంటారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంత‌రం వేదపండితుల ఆశీర్వ‌చ‌నం స్వీక‌రిస్తారు. 

Back to Top