సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే
మేకలపాలెంలో సీఎం వైయస్ జగన్ పర్యటన
26 Jul 2022 4:42 PM
అండగా ఉంటామని వరద బాధితులకు సీఎం భరోసా
అంబేడ్కర్ కోనసీమ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు చేరుకున్నారు. పి.గన్నవరం మండలం పెదపూడి, పుచ్చకాయలవారి పేట, ఊడుమూడిలంక గ్రామాల్లో పర్యటన అనంతరం వాడ్రేవుపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజోలు మండలం మేకలపాలెంకు చేరుకున్నారు. గోదావరి వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు, ఆర్థికసాయం అందిందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలినడకనే మేకలపాలెంలోని ప్రజలందరినీ పలకరించారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.