మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రేపు మంగళగిరి, కర్నూలు జిల్లాలో సీఎం వైయస్ జగన్ పర్యటన
31 May 2023 5:50 PM
తాడేపల్లి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (01–06–2023) గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి సీ కే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహానికి హాజరుకానున్నారు.
అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది– మొదటి విడతగా వైయస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం.
గురువారం (01–06–2023) ఉదయం 7.30 గంటలకు సీఎం వైయస్.జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు.
మంగళగిరిలోని సీ కే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయులుదేరుతారు.
కర్నూలు జిల్లా:
పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం, వరుసగా ఐదో ఏడాది – తొలివిడత వైయస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.