13న  వైయ‌స్ఆర్ వాహ‌న మిత్ర‌

 విశాఖకు సీఎం వైయ‌స్‌ జగన్ 

విశాఖ‌:  ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న వైయ‌స్ఆర్ వాహ‌న మిత్ర కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు.  ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్తారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. తరువాత వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్‌ జరుగుతుంది.
 
11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి.11.45 నుంచి 11.47 గంటల వరకు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి 12.17 గంటలకు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగిస్తారు. 12.20 నుంచి వైయ‌స్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.   

Back to Top