రైతు, రైతు కూలీల మృతిపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

వైయస్‌ఆర్‌ జిల్లా: జమ్ములమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో టిప్పర్‌ ప్రమాదంలో రైతు, రైతు కూలీ మరణించిన ఘటనపై సీఎం శ్రీ వైయస్‌. జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. టిప్పర్‌ పల్టీ  కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 

Back to Top