సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలి

వైయ‌స్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై  సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

 లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలన్న సీఎం 

సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టండి

 అమ‌రావ‌తి: వైయ‌స్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. వైయ‌స్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. సమీక్ష సందర్భంగా అధికారులుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. రీ – సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత మరలా సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలని ఉద్ఘాటించారు. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలని, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నార‌ని గుర్తు చేశారు. తొలివిడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సీఎం. జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలన్న ముఖ్యమంత్రి.  

  • తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92వేలు ఫస్ట్‌ టైం ఎంట్రీస్‌ జరగ్గా,  7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామన్న అధికారులు.
  • 4.30 లక్షల సబ్‌ డివిజన్లు పూర్తి చేసినట్లు వెల్లడి.
  • 19వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయన్న అధికారులు.
  • ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని వెల్లడి.
  • మరో 2వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు.
  • 2023,  పిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు.
  • అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని వెల్లడి.
  • సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలన్న సీఎం
  • గ్రామ సచివాలయంలో కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • దీని కోసం సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలన్న సీఎం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలన్న సీఎం.
  • ఖాళీలున్నచోట వెంటనే నియామకాలు చేపట్టాలన్న సీఎం.
  • 22– ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలన్న సీఎం.
  • ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలును తెలియజేసేలా.. లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలన్న సీఎం.
  • హక్కు పత్రాలు పొందిన వారందరికీ లేఖలు రాయాలన్న సీఎం.
  • సర్వే రాళ్లపైనా సీఎంకు వివరాలందించిన అధికారులు.
  • సర్వేరాళ్ల ఉత్పత్తి వేగం పెంచాలన్న సీఎం.
  • సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలన్న సీఎం.
  • భూగర్భ గనులుశాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలన్న సీఎం.
  • మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామన్న అధికారులు.
  • ఇందుకోసం అవసరమైన ప్రొడక్షన్‌ కెపాసిటీనీ మైనింగ్‌ శాఖ పెంచుకోవాలన్న సీఎం.
  • ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదన్న సీఎం.
  • అర్భన్ ప్రాంతాల్లో సర్వేపైనా సీఎం సమీక్ష.
  • 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4119 వార్డు సచివాలయాల్లో ఇప్పటికే సర్వే కోసం అవసరమైన బృందాల ఏర్పాటు, శిక్షణ పూర్తయిందన్న అధికారులు.
  • హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్‌ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరునాటికి పూర్తిచేస్తామన్న అధికారులు.
  • ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్‌ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలు భూమిని గుర్తించామన్న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు.
  • జూలై 2023 నాటికి పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు.
  • ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి,  ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top