తాడేపల్లి: గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..: మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచాం: సీఎం మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశాం: బెల్టుషాపులను తీసేశాం: పర్మిట్రూమ్లను మూసివేయించాం: లిక్కర్సేల్స్ నెలకు 34 లక్షల కేసులనుంచి 21 లక్షల కేసులకు తగ్గాయి: బీరు సేల్స్ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయి: ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలి: అధికారులకు సీఎం ఆదేశం అక్రమరవాణాపైన, అక్రమంగా మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలి: మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చాం: దీన్ని అమలు చేయాలన్న సీఎం నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి: సీఎం ఎస్ఈబీ కాల్సెంటర్ నంబర్పై బాగా ప్రచారం చేయాలి: అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్కు కాల్చేసేలా ప్రచారం చేయాలి: వచ్చే కాల్స్పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి: సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలి: సీఎం ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి: అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి: క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి: వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలన్న సీఎం గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం గంజాయ సాగు, రవాణాను అరికట్టాలని సీఎం ఆదేశం క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలన్న సీఎం పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు డ్రగ్స్కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎం ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలన్న సీఎం కార్యాచరణ తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్న సీఎం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలన్న సీఎం ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన దృష్టిపెట్టాలన్న సీఎం ఎస్ఈబీ కార్యకలాపాలు: మద్యం అక్రమ రవాణా, తయారీలకు సంబంధించి ఇప్పటివరకూ 1,20,822 కేసులు నమోదు 1,25,202 మంది నిందితుల అరెస్టు 2020లో 63,310 కేసులు నమోదు 2021లో 57,512 కేసులు నమోదు 74,311 కేసులు నమోదు చేసిన ఎస్ఈబీ 46,511 కేసులు నమోదు చేసిన పోలీసులు 8,30,910 లీటర్ల అక్రమ మద్యం సీజ్ 8,07,644 లీటర్ల నాటుసారా స్వాధీనం 2,30,48,401 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం 29,491 వాహనాలు సీజ్ ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 12,211 కేసులు నమోదు 22,769 మంది నిందితులు అరెస్టు 5,72,372 టన్నుల ఇసుక స్వాధీనం 16,365 వాహనాలు స్వాధీనం గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 220 కేసులు నమోదు 384 మంది అరెస్టు 18,686 కేజీల గంజాయి స్వాధీనం మార్చి 20, 2021 నుంచి మార్చి 31, 2021 మధ్య ఆపరేషన్ నయా సవేరా కింద స్పెషల్ ఆపరేషన్ 69 కేసులు నమోదు, 174 మంది అరెస్టు 2176 కేజీల గంజాయి స్వాధీనం 3.065 ఎండీఎం స్వాధీనం 330 అవేర్నెస్ క్యాంపులు నిర్వహించామని తెలిపిన అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.