మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు
12 Aug 2021 2:21 PM
ప్రతి 4 వారాలకు ఒకసారి సమగ్ర భూ సర్వేపై సమీక్ష చేస్తా
జూన్ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి
శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని, లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని తెలిపారు. శాశ్వత భూహక్కు-భూరక్షపై ఆయన గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలన్నారు. అవసరమైన సాఫ్ట్వేర్ను తీసుకోవాలని తెలిపారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
ప్రతి 4 వారాలకు ఒకసారి సమగ్ర భూ సర్వేపై సమీక్ష చేస్తానని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే కాన్ఫరెన్స్లో కూడా సమీక్షిస్తా. వారానికి ఒకసారి మంత్రుల కమిటీ కూడా సమీక్ష చేయాలన్నారు. సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోవాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.