జ‌ల‌వ‌న‌రుల శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: జలవనరుల శాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగ‌తి, ప్రాధాన్య‌త క్ర‌మంలో చేప‌ట్టాల్సిన ప్రాజెక్టులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక‌ శాఖ స్పెషల్ సీఎస్‌ ఎస్‌. ఎస్‌. రావత్, జలవనరులశాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్ సి. నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top