తాడేపల్లి: మహిళల భద్రత, రక్షణ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. దిశ చట్టం కింద తీసుకుంటున్న చర్యలు, అమలుపై సీఎం శ్రీ వైయస్.జగన్ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా పోలీససులు యాక్టివ్గా ఉండాలి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్గా చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. జీరోఎఫ్ఐఆర్ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలన్నారు. బాధిత మహిళ ఒక గ్రామం నుంచి పోలీస్స్టేషన్కు వెళ్లడానికి సంకోచించవచ్చు. అలాంటి మహిళలు గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసుల ద్వారానే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఈ ఆలోచనను మరింత అధ్యయనం చేసి మెరుగ్గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దిశ యాప్ ఫీచర్లపై శిక్షణ : దిశయాప్ల్లో ఉన్న అన్ని ఫీచర్లపైనా మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన, శిక్షణ కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లాకలెక్టర్, ఎస్పీలు సమావేశమై ప్రజాసమస్యలతోపాటు, మహిళల భద్రతపైనా సమీక్ష చేయాలి ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి పంపించాలన్నారు. పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రిసెప్షన్ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా చూడాలని, దీనిపై ఉన్నతాధికారులు రివ్యూచేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి పోలీస్స్టేషన్లో డిస్ప్లే ‘దిశ’ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పోలీస్స్టేషన్లో డిస్ప్లే ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. మహిళలపై నేరాలకు సంబంధించిన 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాం. మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీనికి సంబంధించి మాట్లాడాలని సీఎం సూచించారు. బాలలపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. కేంద్ర మంత్రికి లేఖ.. దిశ బిల్లు ఆమోదం కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసినట్లు సీఎం వైయస్ జగన్ తెలిపారు. ‘‘దిశ’’ చట్టం ఆమోదంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వివరించిన అధికారులు. కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖలో పెండింగులో ఉందని, పలుమార్లు రిమైండర్స్కూడా పంపామని తెలిపిన అధికారులు. దిశ బిల్లు ఆమోదం ప్రక్రియ చురుగ్గా సాగేలా కేంద్ర స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖరాయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వారాంతంలోగా ఇప్పటికే ఉన్న డిజిగ్నేటెడ్ కోర్టుల్లో పూర్తిస్థాయి రెగ్యులర్ పీపీల నియామకం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 181 విమెన్ హెల్ప్లైన్ను దిశకు అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ‘‘దిశ’’కు మరింత బలం: ‘‘దిశ’’ కాల్సెంటర్లో అదనపు సిబ్బంది ద్వారా బలోపేతానికి సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టంచేశారు. దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 స్కార్పియోల కొనుగోలుకు సీఎం ఆమోదం. విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు వీటితోపాటు ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన పోలీస్స్టేషన్లకు ఈ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా 6 దిశ పోలీసు స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్స్టేషన్ల నిర్మానానికి సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటికి సంబంధించిన నిధులను త్వరగా విడుదలచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘దిశ’’కింద నమోదవుతున్న కేసుల పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబుల్లో ఇప్పటికే 58 పోస్టులు భర్తీ చేయాలన్నారు. మరో 61 మందిని నియమించడానికి సీఎం అంగీకారం తెలిపారు. వీటితోపాటు తిరుపతి, వైజాగ్ల్లో (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్)ల్యాబ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అనంతపురం, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడల్లో మూడేళ్లకాలంలో స్పెషల్ అసిస్టెన్స్ కింద దిశ ల్యాబ్లు నిర్మించాలని సూచించారు. దిశయాప్లో భాగంగా అభయం: దిశ యాప్లో ఫీచర్స్ మెరుగ్గా ఉండడంతోపాటు, అభయం ప్రాజెక్టు లక్ష్యాలన్నీకూడా కూడా చేరుకుంటుండడంతో దిశ యాప్నే అభయం ప్రాజెక్టుకూ వినియోగంపై సమావేశంలో చర్చ జరిగింది. దిశ కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంలో ‘‘అభయ’’ కూడా భాగంకానుంది. డిసెంబర్ కల్లా లక్ష వాహనాలకు అభయం పరికరాల అమరుస్తామని అధికారులు సీఎంకు వెల్లడించారు. ఉక్కుపాదం మోపండి: గంజాయి రవాణా, సరఫరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గంజాయి సేవిస్తూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలను సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రస్తావించారు. ఇప్పటికే పోలీసులు దాడులు చేస్తున్నారని, వీటిని మరింత విస్తృతంచేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఘటనలను వక్రీకరించి ప్రభుత్వంపైనా, పోలీసులపైనా దుష్ప్రచారం: కొన్ని ఘటనలను పూర్తిగా వక్రీకరించి ప్రభుత్వంపైనా, పోలీసు విభాగంపైనా దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత సమావేశంలో ప్రస్తావించారు. జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోల్లో ఉద్దేశపూర్వరంగా కొంతభాగాన్ని ఎడిట్చేసి వైరల్చేసి ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సందర్భాల్లో నిజానిజాలను ప్రజలముందు పెట్టాలని సీఎం పోలీసు అధికారులకు సూచించారు. బాధితురాలిని ఆదుకునే విషయంలో ఆలస్యం కాకూడదు: అఘాయిత్యాలకు గురైన బాధితురాలిని ఆదుకునే విషయంలో జాప్యానికి తావుండరాదని సీఎం శ్రీ వైయస్.జగన్ స్పష్టంచేశారు. ప్రతికేసు విషయంలోకూడా ధ్యాసపెట్టి బాధితురాలికి న్యాయంచేయాలని సీఎం ఆదేశించారు. సుగాలి ప్రీతికుటుంబానికి సహాయం విషయంలో తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రీతి తండ్రికి ఉద్యోగాన్ని ఇస్తున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ప్రీతిసుగాలి తల్లికి కూడా కోరుకున్న విధంగా కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నామన్నారు. ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టేలా... ప్రభుత్వం తరఫున హైకోర్టులో కౌంటర్ వేస్తున్నామని సీఎంకు వివరించారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా 5 సెంట్ల ఇంటి పట్టా, 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రతికేసులోకూడా ఈ రకంగా ధ్యాసపెట్టాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.