కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం వైయ‌స్‌ జగన్‌

కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన ముఖ్య‌మంత్రి

చిత్తూరు:   కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం వైయ‌స్ జగన్‌ లక్ష్యంగా , కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం వైయ‌స్‌ జగన్ నిల‌బెట్టుకున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నీటిని విడుదల చేశారు. కృష్ణా జ‌లాల‌కు ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అంద‌నుంది.

కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు  సీఎం వైయ‌స్ జగన్‌ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేశారు.

Back to Top