బాప‌ట్ల‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన స‌భా ప్రాంగనానికి చేరుకున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం అమలుపై సభా ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో ఏర్పాటు చేసిన ఫొటో సెష‌న్‌లో పాల్గొన్నారు. అనంత‌రం జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను మ‌రికాసేప‌ట్లో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

Back to Top