మ‌హ‌నీయుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి: భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మ‌హ‌నీయుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వ‌ల్ల‌భాయి ప‌టేల్‌, పొట్టి శ్రీ‌రాములు చిత్రపటాలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పూలమాల‌లు వేసి ఘ‌న‌ నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top