రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కాసేపట్లో నెల్లూరుకు సీఎం వైయస్ జగన్
11 Jan 2021 11:21 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో నెల్లూరు చేరుకోనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్.. మరికాసేపట్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన `అమ్మఒడి` పథకం ప్రారంభోత్సవ సభా ప్రాంగణానికి బయల్దేరుతారు. `జగనన్న అమ్మఒడి` రెండో ఏడాది చెల్లింపులను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు.
పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ‘అమ్మఒడి’ పథకాన్ని రూపొందించారు. వరుసగా రెండవ ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండవ ఏడాది అమ్మఒడి పథకం కోసం ప్రభుత్వం రూ.6,673 కోట్లను ఖర్చు చేస్తోంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి అకౌంట్లో రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ ఏడాది 44,48,865 మంది తల్లులకు అమ్మఒడి సాయాన్ని సీఎం వైయస్ జగన్ అందించనున్నారు.