‘ది ఫ్రంటియ‌ర్‌‌’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్ట్‌ రెహనా రచించిన ‘ది ఫ్రంటియ‌ర్‌‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ‘ది ఫ్రంటియ‌ర్‌‌’ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకకృష్ణారెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, సమాచారశాఖ కమిషనర్‌ టి. విజయ్‌కుమార్‌ రెడ్డి, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, సాక్షి టీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ నేమాని భాస్కర్‌ తదితరులు హాజరయ్యారు. 

Back to Top