వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించండి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర విదేశాంగ మంత్రిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్‌ జరుగుతోందని, రిజిస్ట్రేషన్‌ సందర్బంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని సీఎం కోరారు. రిజిస్ట్రేషన్‌ వివరాలను రాష్ట్రాలకు అందించాలని, ఫలితంగా తాము వారి క్వారంటైన్‌ కోసం ఏర్పాట్లు చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, వారికి ఇబ్బందులు లేకుండా ఇండియాకు వచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారు. 

Back to Top