యలమంచిలి పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా యలమంచిలి పర్యటనకు బయల్దేరారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి సీఎం వైయస్‌ జగన్‌ నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ మధ్యాహ్నం యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు. ఆనంద్‌ తండ్రి, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించ‌నున్నారు. 

Back to Top