వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో ఆంధ్రరాష్ట్రాన్ని నిలపాలి

విజయవాడ గుణదలలో హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

హయత్‌ ప్లేస్‌ యాజమాన్యానికి సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చే ప్రతి సంస్థకు చేయూతనిచ్చి ప్రోత్సహిస్తాం

మంచి టూరిజం పాలసీని తీసుకువ‌చ్చి స‌హాయ‌, స‌హ‌కారాలు అందిస్తున్నాం

విజయవాడ: ఆంధ్రరాష్ట్రాన్ని వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో నిలిపేందుకు  ముందుకువచ్చే ప్రతి సంస్థకు చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇంటర్నేషనల్‌ హోటల్స్‌ రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం హోటల్‌ చైర్మన్‌ వీరస్వామి, హయత్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఏరియా ప్రెసిడెంట్‌ శ్రీకాంత్, చైర్మన్‌ వీరస్వామి తనయుడు కార్తీక్, ఈ ప్రాజెక్టులో మమేకమైన వారందరికీ సీఎం వైయస్‌ జగన్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

హోటల్‌ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతటా ఇటువంటి ప్రసిద్ధిగాంచిన హోటల్స్‌ రావాలని, వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం రావాలని ఆకాంక్షించారు. అందుకోసం మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చామని, రాష్ట్రంలో హోటల్స్‌ స్థాపించే సంస్థలను ప్రోత్సహిస్తూ వస్తున్నామని చెప్పారు. 

ఒబేరాయ్‌ హోటల్స్‌ మొదలుకొని నేడు ప్రారంభించిన హయత్‌ ప్లేస్‌ వరకు మొత్తం 11 పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో వారి బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు ప్రభుత్వ పరంగా వారికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఇంకా నలుగురికి స్ఫూర్తిని ఇవ్వాలని, అనేక మంది పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపేవారందరికీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top