మన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు సీఎం వైయ‌స్ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు
 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు వారందరికీ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుబుంబానికి ప్ర‌త్యేక‌  సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్‌ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆకాంక్షించారు.

Back to Top