నియామకపత్రాలు అందజేసిన సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది . విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సచివాలయంలో ఉద్యోగం సాధించిన గంపగూడెం గ్రామానికి చెందిన ముత్యాలుకు సీఎం వైయస్‌ జగన్‌ నియామకపత్రం అందజేసి అభినందనలు తెలిపారు. 
 

Back to Top