టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
ఎమ్మెల్యేలు ఎలీజా, గణేష్లకు సీఎం వైయస్ జగన్ పరామర్శ
10 Oct 2022 10:38 AM
తాడేపల్లి: ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. ఆయనను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సతీమణి ఝాన్సీరాణితో కూడా ఫోన్లో మాట్లాడిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు.
అలాగే మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను ఫోన్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.