గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రు

విజయవాడ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయ‌స్ భార‌తి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గ‌వ‌ర్న‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి, మంత్రుల ఫొటో సెష‌న్ జ‌రిగింది. అనంత‌రం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.

తాజా వీడియోలు

Back to Top