నేడు `జగనన్న విదేశీ విద్యా దీవెన`కు శ్రీ‌కారం 

టాప్‌ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సాయం 

తొలి విడతగా 213 మందికి రూ.19.95 కోట్ల సాయం

ల‌బ్ధిదారుల ఖాతాల్లో న‌గ‌దు జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ఆర్థిక సాయం అందించే జగనన్న విదేశీ విద్యా దీవెన ప‌థ‌కం అమలుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మందికి మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. 

జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా 
నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌ 200 యూనివర్సిటీల ఎంపిక చేస్తారు. టాప్‌ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.కోటి వరకు 100 శాతం ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 100 – 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100శాతం ట్యూషన్‌ ఫీజు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రీయిబర్స్‌మెంట్‌ చేస్తారు. మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్‌ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.  విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలను సైతం ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది

తాజా వీడియోలు

Back to Top