చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయం

దొంగసర్వేలతో బాబు పబ్బం 

ఏపీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

విశాఖపట్నం:చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు .విశాఖలో ఆయనతో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఓడిపోతుందని తెలిసి దొంగ సర్వేలతో పబ్బం గడపాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడి బాబుకు అనుకూలంగా లగడపాటి సర్వే అంటూ దుయ్యబట్టారు.గతంలో ఎన్టీఆర్‌ చుట్టూ జాతీయ నాయకులు తిరిగేవారు..ఇప్పుడు జాతీయ నేతల చుట్టూ చంద్రబాబు తిరిగే దుస్థితి ఏర్పడిందన్నారు.ఏపీ ప్రతిష్టను చంద్రబాబును దిగజారుస్తున్నారని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top