వైయ‌స్ జ‌గ‌న్ కేసు బ‌దిలీ చేయాల్సిన అవ‌స‌రం లేదు

సుప్రీం కోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు
 

ఢిల్లీ : సుప్రీం కోర్టులో టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది. అయితే వైయ‌స్ జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా? అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. 
 

Back to Top