మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అమరావతి భూ కుంభకోణంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు
10 Oct 2020 9:43 PM
విజయవాడ: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్ సోమయాజులు స్టే ఇవ్వడంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించి కుంభకోణానికి పాల్పడ్డారని, దీనిపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి సోమయాజులు స్టే ఇచ్చారన్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఏకంగా గాగ్ ఆర్డర్ ఇచ్చిందన్నారు.ఈ కేసుల్లో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేసినట్ల అజయ కల్లం తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు అక్టోబర్ 8న అందించినట్లు తెలిపారు.నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.