స్పార్క్‌ –2022 అవార్డును సొంతం చేసుకున్న ఏపీ మెప్మా

రూ.20 కోట్ల న‌గ‌దు అందించిన కేంద్ర ప్ర‌భుత్వం

రాష్ట్ర అధికారుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పేదరిక నిర్మూలన సంస్ధ(మెప్మా) స్పార్క్‌ –2022 అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు కింద రూ.20 కోట్ల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అంద‌జేసింది. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో స్పార్క్‌ అవార్డును సీఎం  వైయస్‌.జగన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, మెప్మా ఎండీ విజయలక్ష్మి, మెప్మా స్టేట్‌ మిషన్‌ మేనేజర్‌ ఆదినారాయణ, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌లు చూపించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులను సీఎం  వైయస్‌.జగన్ అభినందించారు.

తాజా వీడియోలు

Back to Top