నేడు ఏపీ కేబినెట్ స‌మావేశం

  పలు నిర్ణయాలకు ఆమోదం!
 

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చర్చించి ఆమోదిస్తారని తెలిపాయి. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

తాజా వీడియోలు

Back to Top