40 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 నెల్లూరు జిల్లా:  శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ త‌గిలింది. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కందలపాడు గ్రామానికి చెందిన 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి  సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసినా, పార్టీ అధికారంలోకి వచ్చినా, తమ గ్రామాల్లోని సమస్యలు పట్టించుకోలేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా, కందలపాడు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా ఆయన దగ్గరకు వెళ్లి మ‌ద్ద‌తు తెలిపారు. రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుందని, తమ అవస్థలు గమనించి, కనుపూరు కాలువపై బ్రిడ్జి నిర్మిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రయాణించేందుకు గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 24 గంటలల్లోపే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయించారు.  2 నెలల కాలవ్యవధిలోనే కనుపూరు కాల్వ‌పై వంతెన నిర్మిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.
 

Back to Top