ఏపీకి అవార్డుల పంట‌

రాష్ట్రంలోని 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవార్డులు ప్రదానం చేసిన ప్రధాని

తాడేప‌ల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. ఏపీకి 17 అవార్డులు వచ్చాయని.. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు వచ్చిందన్నారు. గాంధీ స్ఫూర్తితో సీఎం వైయ‌స్ జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని.. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
 

Back to Top