అవినీతి నిర్మూలనే అసలైన లక్ష్యం

పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన అనే లక్ష్యాలతో పని చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. ఇందుకోసమే పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఎన్నో పౌరసేవలకు సచివాలయం కేంద్ర బిందువు. ప్రతి చిన్న అవసరానికి మండల ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయం ద్వారా నేరుగా ప్రజలు తమ సమస్యలు తీర్చుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ సులువుగా ప్రజలకు చేరుతున్నాయి. 
ఐఐఎం ద్వారా అవినీతికి చెక్
దీంతోపాటుగా కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ఐఐఎం అహ్మదాబాద్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బృందం ముఖ్యమంత్రిగారి సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. 
కొత్తగా ఏర్పాటైన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ఇతర ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించడంతో పాటు అవినీతి రహితంగా ప్రభుత్వ శాఖలను తీర్చిదిద్దేందుకు సూచనలు ఇవ్వడం, వాటి అమల్లో భాగస్వాములు కావడం ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు.
ఐఐఎం బృందం ఫిబ్రవరి వరకూ అధ్యయనం చేసి అవినీతి రహిత పాలనకు ఉపయోగపడే సిఫార్సులను, సూచనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో చేయాల్సిన మార్పులు, చేపట్టాల్సిన అవినీతి వ్యతిరేక చర్యలను తెలియజేస్తుంది. వనరుల్ని సమర్థంగా వాడుకునే విధివిధానలను సూచిస్తుంది. ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడి మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన సలహాలను అందిస్తుంది. 

Read Also: సుజనా చౌదరి ఎవరంటే బ్యాంకు దొంగ అంటారు

Back to Top