సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
నిరుపేదల చదువుకు చంద్రబాబు గండం..!
10 Jun 2016 11:22 PM
హైదరాబాద్) విదేశీ ప్రయాణాలు, ప్రత్యేక విమానాలతో బిజీగా ఉన్న చంద్రబాబు..నిరుపేదల జీవితాల మీద పగ పట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులకు అండగా ఉండే వసతి గృహాల మూసివేతకు కత్తి నూరుతున్నారు. దీంతో బలహీన వర్గాల పిల్లలకు చదువు గండం రానుంది.
బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుల్లో హాస్టల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతీ మండలంలోనూ 3,4 చోట్ల ఈ హాస్టల్స్ కనిపిస్తాయి. వీటిలో భోజన వసతి, నివాస వసతి కల్పిస్తారు. పిల్లలకు స్తానికంగా ఉండే హాస్టల్స్ లో చదువుకొనేందుకు అడ్మిషన్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో పిల్లలు అక్కడ చదువుకొంటూ ఉంటారు. ఈ హాస్టల్స్ లో ఉండే పిల్లల విద్యా ప్రమాణాలు పెంచేందుకు గత ప్రభుత్వాలు చాలా చర్యలు చేపట్టాయి.
చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచీ ప్రయోగాల పేరిట బడుగు విద్యార్థుల చదువుల మీద కక్ష కట్టారు. రేషనలైజేషన్ పేరుతో వసతి గృహాల మూసివేతకు చర్యలుచేపట్టారు. విద్యార్థుల్ని దగ్గరలో ఉండే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తామని గొప్పలు చెబుతున్నారు. అయితే వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిపడా స్కూల్స్ లేవన్న సంగతి అందిరికీ తెలుసు. దీంతో విద్యార్థులు రోడ్డున పడనున్నారు. నిరుపేదల చదువుకు చంద్రబాబు పెడుతున్న శాపం మీద నిరుపేదల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.