పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
జై సింగపూర్.. జై జై సింగపూర్
30 Sep 2015 2:21 PM
చంద్రబాబు మనసంతా సింగపూర్ మయం
ప్రారంభోత్సవం నుంచి హైప్ క్రియేట్ చేసే యోచన
హడావుడి ప్రచారంతో పెట్టుబడులకు ప్రణాళిక
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పనులన్నీ పక్కకు పెట్టేశారు. వచ్చే నెలలో జరగబోయే రాజధాని శంకుస్థాపన పనుల మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా సింగపూర్ నామస్మరణలో మునిగి తేలుతోంది.
అనేక సమస్యలున్నా పట్టని సీఎం
రాష్ట్రంలో అతి ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యల బాట పడుతున్నారు. కూలీలు దిక్కుతోచక వలసలు పోతున్నారు. డ్వాక్రా మహిళలు రుణ మాపీ జరగక పోవటంతో పాత అప్పులు తీర్చలేక, కొత్త రుణాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇటు, మధ్యతరగతి వ్యాపారులు ఆదరణ దొరక్క అల్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టత లేకపోవటంతో గందరగోళం లో ఉన్నారు. ఇన్ని సమస్యలు వేధిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉపశమనం దొరకటం లేదు. రాజధాని, సింగపూర్ తప్ప మరో మాట వినిపించటం లేదు.
ప్రారంబోత్సవం నుంచి హైప్
అక్టోబర్ 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయం గా నిర్ణయించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్ లు, ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 15 వందల మంది వీ వీఐపీలకు ఆహ్వానాలు వెళుతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల్ని పిలుస్తున్నారు. ఇంతమంది వస్తుంటే ఆ ఖర్చంతా రాష్ట్ర ప్రజల మీదనే పడుతుందనటంలో సందేహం లేదు. ఇంతమంది తో భారీగా శంకుస్థాపన చేయించటం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
పెట్టుబడుల కోసం ప్రణాళిక
ఈ స్థాయిలో ప్రచారం చేసేందుకు నేషనల్ చానెల్స్ తో ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఇప్పటికే రాజధాని లో రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అందుచేత ఆ దిశగానే పెట్టుబడుల్ని ఆకర్షిస్తారని తెలుస్తోంది. అంటే ఆయా కంపెనీల కార్యకలాపాలు ఎలా ఉన్నప్పటికీ అడ్డగోలుగా విలువైన భూముల్ని 99 సంవత్సరాలకు గాను లీజుకు ఇచ్చేసేందుకు రంగం సిద్ధం అయింది. దీంతో రాజధాని పూర్తిగా సింగపూర్ చేతుల్లో పెట్టేసేట్లుగా పావులు కదుపుతున్నారు.