పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
వ్యక్తిగత సమాచారం గోప్యత.. ప్రజల ప్రాథమిక హక్కు
04 Mar 2019 2:09 PM
ఏపీ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోంది..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..
హైదరాబాద్: టీడీపీ నేతలకు డేటాచోరీ కేసులో అవగాహన లేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనా«ద్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలను ప్రచారం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం మారిందన్నారు. టీడీపీ నాల్జెడ్ సెంటర్ అవాస్తవాలకు కేంద్రంగా మారిందన్నారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు సంస్దలకు ఏ విధంగా వెళ్లిందని ప్రశ్నించారు. ఈ సమాచారం అంతా ప్రగతి కోసం అని మంత్రి లోకేష్ అంటారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఓట్ల తొలగింపు కూడా వీరి కుట్రే అని తెలిపారు. సర్వేల పేరుతో ఓటర్ల సమాచారం సేకరించారన్నారు. ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి ఓట్ల తొలగింపు చేపట్టారన్నారు. ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారన్నారు.గతంలో టీచర్లు ఓటర్ నమోదు,తొలగింపు చేసేవారు.కాని ప్రస్తుతం అంగన్ వాడి ల ద్వారా చేస్తున్నారన్నారు. వీరందరూ కూడా తాత్కాలిక ఉద్యోగులు అని, వీరు జన్మభూమి కమిటి సభ్యుల వత్తిడికి లొంగి పనిచేస్తుంటారన్నారు. సేకరించిన రాష్ర్ట ప్రజల సమాచారాన్ని డేటా హబ్ లో పెట్టారు. భారతదేశ చట్ట ప్రకారం ఎక్కడ నేరం జరిగితే అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారన్నారు. కాని నేను మాత్రం హైద్రాబాద్ లో నేరం జరిగినా నేను దర్యాప్తు చేస్తానంటారని ఎద్దేవా చేశారు. ఓటర్ల లిస్ట్ నుంచి మీకు నచ్చని ఓటర్లను తొలగించేందుకు యంత్రాంగం తయారు చేశారన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. విచారణలో నిజానిజాలు బయటపడతాయి.విచారణ జరుపుతుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్దలకు అమ్ముకుంటున్నారన్నారు. వ్యక్తిగత సమాచారం దొంగింలించినందుకు మీకు అభినందనలు తెలిపాలా? అని ప్రశ్నించారు. -బ్లూప్రాగ్ ,ఐటి గ్రిడ్ సంస్దలకు ఈ సమాచారం ఇచ్చారన్నారు. వీరు ఎవరు అంటే ఎప్పుడు సిిఎం పేషిలో కనిపిస్తుంటారని తెలిపారు. ఈ సంస్దలకు అనేక పనులు ఇచ్చారు.30 కోట్ల రూపాయలకు పంటలకు సంభందించి ఓ కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. రాష్ర్టంలో ఉండే ప్రతి కరెంట్ పోల్ కు జియే టాగ్ వేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారని, 2014 ముందు ఐటి గ్రిడ్ ఎప్పుడైనా వ్యాపారం చేసిందా అంటే అదీ లేదన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైనా కంపనీ.అంటే మీ కోసమే ఇది ఏర్పాటుచేసినట్లు కనిపిస్తోంది కదా? అని ప్రశ్నించారు. డేటా చోరీ విషయం బయటకు రాగానే యాప్ నుంచి డేటా ఎందుకు తీసేశారో సమాధానం చెప్పాలన్నారు. పౌరుల ఆధార్ కార్డుల సమాచారం ఐటి గ్రిడ్స్ సంస్ధకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. సేవామిత్ర యాప్ డౌన్ లోడ్ చేస్కున్న ప్రతి ఒక్కరి డేటా ఐటి గ్రిడ్స్ వద్ద ఉందన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు,బ్యాంక్ అకౌంట్స్ ఐటి గ్రిడ్స్ వద్ద ఉన్నాయన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది.బ్యాంక్ అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని సూచించారు. డేటా పట్ల అప్రమత్తంగా ఉండండి అని విజ్ఞప్తి చేశారు. ఈ కుంభకోణం బయటకు రాగానే ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అదేమంటే టిడిపి డేటా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. టిడిపి డేటా గురించి మేం మాట్లాడటం లేదని, ప్రజలకు సంబంధించిన రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా
ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం అని, ఏపి ప్రభుత్వం తప్పు చేయలేదంటే విచారణకు సిధ్దపడాలన్నారు. ఏం జరిగింది?భాధ్యులెవరు అనేది బయటకు రావాలని డిమాండ్ చేశారు. టిడిపి అంటే తెలుగుప్రజల సమాచారం దొంగిలించే పార్టీ అని, వ్యక్తిగత సమాచారం గోప్యత ప్రజల ప్రాధమిక హక్కు అని అన్నారు. తన కిష్టం లేని ఓట్లను తొలగించేందుకు టిడిపి ఏకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసిందన్నారు. సేవామిత్ర యాప్ మన ఫోన్ లో ఉంటే మన ఆనుపానులు మొత్తం తెలిసిపోతుందన్నారు. సేవామిత్ర యాప్ లోకి కలర్ ఫోటోలు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సత్యన్నారాయణ అనే వ్యక్తి పదవీ విరమణ చేసిన ఐ ఏ ఎస్ అధికారిని తర్వాత ఆయనను తీసుకువచ్చి తిరిగి ఏపి ప్రభుత్వం సలహాదారుగా సర్వీసులు ఉపయోగించుకుంటోందన్నారు. ఆయనకు హైద్రాబాద్ లో స్ధలం ఇచ్చారన్నారు. అమరావతిలో స్ధలం ఇచ్చారన్నారు. సలహాదారుగా ఉంటూ ఆధార్ గౌరవాధ్యక్షుడుగా ఉంటున్నారని, కాబట్టి ఆయనను ఆ పోస్టునుంచి తొలగించాలని కోరారు. ఐటి గ్రిడ్ కుంభకోణంపై ఆధార్ సంస్ధ, ఎన్నికల కమిషన్,సైబర్ క్రైం పోలీసు విచారణలు జరపాలన్నారు.