2014లో ఇంటింటా సంతోషాలు నిండాలి

హైదరాబాద్, 01 జనవరి 2014:

ఈ నూతన సంవత్సరం రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. 2014 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 9 కోట్ల ప్రజల భద్రతకు, అభివృద్ధికి, సంక్షేమానికి భరోసా లభించాలని ఆయన అభిలషించారు. క్యాలెండర్ల మార్పుతో పాటు 2014 మన రాష్ట్రంలోని, మన దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పునకు దారితీయాలని తన శుభాకాంక్షల సందేశంలో మనస్ఫూర్తిగా శ్రీ జగన్‌ కోరుకున్నారు.

Back to Top