<strong>హైదరాబాద్, 10 ఏప్రిల్ 2013:</strong> ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాలలో ఉన్న తెలుగువారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం శ్రీ విజయనామ సంవత్సరంలో రాష్ట్రాభ్యుదయాన్ని కోరే ప్రజా శక్తులకు అన్నింటా విజయం చేకూరాలని ఆమె బుధవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఆకాంక్షించారు.<br/>నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని, పాడి పంటలు వర్ధిల్లాలని, రైతులు, పల్లెలు కళకళలాడాలని శ్రీమతి విజయమ్మ ఆకాంక్షించారు. రాష్ట్రం పారిశ్రామికంగా ప్రగతి సాధించాలని, వృత్తులన్నీ వృద్ధి చెందాలని, సంక్షోభాలన్నీ తొలగిపోవాలని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.