<br/>గుంటూరు: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర గుంటూరు జి ల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే వైయస్ జగన్ ఉండవల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జననేత పాల్గొని ప్రసంగించనున్నారు. వైయస్ జగన్ తమ ఊరికి రావడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు వేలాదిగా ఉండవల్లికి తరలివచ్చారు. అశేష జనవాహినితో ఉండవల్లి జనసంద్రమైంది.