<br/>గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ పొన్నూరు నియోజకవర్గం చింతలపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలువురు మహిళలు తమ రుణాలు మాఫీ చేయాలని కోరారు. వారితో వైయస్ జగన్ మాట్లాడుతూ..మనందరి ప్రభుత్వం రాగానే నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఆ డబ్బులు మీ చేతికే ఇస్తామని మాట ఇచ్చారు.