కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 300 కిలోమీటర్లు దాటింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బీ.అగ్రహారం గ్రామంలో 300 కిలోమీటర్లు పూర్తి కావడంతో అక్కడ వైయస్ జగన్ మొక్కలు నాటారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన వైయస్ జగన్ పాదయాత్ర 21వ రోజులుగా కొనసాగుతోంది.