<br/>కర్నూలు: డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లె గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంగళవారం పాదయాత్రలో భాగంగా సాయంత్రం గ్రామంలో పర్యటించిన వైయస్ జగన్కు గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. అనంతరం జననేతతో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు.