అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 31వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి కోటంక గ్రామానికి, 10.30 గంటలకు ఊర్వకొండ నియోజకవర్గం కోడేరు మండలం కమ్మూరుకు చేరుకుంటారు. 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు అరవకూరు, 4 గంటలకు కూడేరు గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వైయస్ జగన్ 31వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.